ఈ ఏడాది జనవరి 7 వ తేదీన గుంటూరు జిల్లాలోని విజ్ఞాన్ యూనివర్సిటీకి గెస్ట్ స్పీకర్ గా వెళ్ళాను. అప్పుడు "రచనా నైపుణ్యాలను పెంచుకోవడమెలా" అనే అంశంపై దాదాపు రెండు గంటలు అక్కడి B.tech 4వ సంవత్సరం విద్యార్థులకు చెప్పడం జరిగింది.
నేను నా జీవితంలో ధారాళంగా రెండు గంటల సేపు నిలబడి చెప్పిన మొదటి సందర్భం ఇదే. కావున ఇది నాకెంతో ఆనందాన్ని పంచిన అనుభవం. ఇందుకు నాకెంతో గర్వంగా కూడా ఉంది. నన్ను అక్కడికి పిలిపించి ఈ అవకాశాన్ని ఇచ్చిన అసిస్టెంట్ ప్రొఫెసర్ సి.రవి కిరణ్ గారికి, డీన్ రాఘవ రావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి